సెప్టెంబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన
అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశం
వైద్య కళాశాలలు, ఆసుపత్రులపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం
నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూడాలని ఆదేశం
ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
సమీక్ష
గుంటూరు : ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్
కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల
రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్
సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి
ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని
నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు
అంతా సిద్ధం చేసుకోవాలన్న సీఎం నూతన మెడికల్ కాలేజీలు, నిర్వహణపైనా
సమీక్షించారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత
సమర్థవంతంగా ఉండాలన్న సీఎం నిర్వహణకు నిధులు సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక
విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది విజయనగరం,
మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు
జరగనున్నాయని, వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సిద్ధం
అవుతున్నామని అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్,
మదనపల్లెల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని అధికారులు
తెలిపారు.
ఆరోగ్య శ్రీ సేవలను పొందడంపై ప్రతి ఒక్కొరికీ కూడా అవగాహన కల్పించాలన్న సీఎం.
దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని అదేదేశించారు.
సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్నిరకాలుగా
సిద్ధంచేసుకోవాలన్న సీఎం. ప్రతి కుటుంబానికీ కూడా ఆరోగ్య శ్రీ సేవలను ఎలా
పొందాలన్న దానిపై సమగ్ర వివరాలతో బుక్లెట్ అందిందాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద
చికిత్స పొందడం ఎలా? అన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా అవగాహన ఉండాలని, విలేజ్
క్లినిక్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది
ద్వారా పూర్తి వివరాలతో సమాచారం అందించాలని, వీళ్లు ప్రతి ఇంటికీ వెళ్లికూడా
ఆరోగ్య శ్రీ గురించి సవివరంగా తెలియజేయాలన్నారు. అనారోగ్యం వచ్చినా,
దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్య శ్రీ కింద ఎలా చికిత్స
పొందాలన్నదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, వారు ఉంటున్న ప్రాంతానికి
అత్యంత సమీపంలోని నెట్వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స అందుకోవాలన్నదానిపై
అవగాహన ఉండాలని, ప్రజలకూ తెలియజేయాలన్నారు. ఒక్క యాప్ద్వారానే కాకుండా ఇతర
మార్గాల ద్వారా, ఇతర కాల్ సెంటర్ల ద్వారా కూడా ఆరోగ్య శ్రీ సేవలు పొందడంపై
పూర్తి అవగాహన ఉండాలని కోరారు. ఆరోగ్య శ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను ఈ
ప్రభుత్వం రాకముందు 1000 ఉంటే, ఇప్పుడు 3,255కి పెంచామని, ఈసేవలను పొందడంపై
ప్రజలకు పూర్తి అవగాహన, సమాచారం ఉండాలన్నారు. సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు
వచ్చినా, లంచాల ప్రస్తావన వచ్చినా ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన
నంబర్లనుకూడా ప్రజలకు తెలియచెప్పాలని, నెట్వర్క్ ఆస్పత్రులు వారి వారి
పరిధిలో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ఇది కచ్చితంగా
అమలయ్యేలా చూడాలని, విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని
ఈశిబిరాలు అమలు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా
ఉండాలన్న సీఎం నిర్వహణకు నిధులు సమస్యరాకుండా చూసుకునేందుకు ఒక విధానం
తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణాలు చేయడం, పరికరాలు
ఏర్పాటు చేయడం అన్నది ఎంత ముఖ్యమో, వాటిని ఉత్తమంగా నిర్వహించడం కూడా అంతే
ముఖ్యముని, అలా చేయకపోతే పరిస్థితులు మళ్లీ మొదటి వస్తాయన్న సీఎం ఆయా
ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద అందించే సేవలకు గాను ప్రభుత్వం నుంచి వాటికి
వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతిని
తీసుకురావాలన్నారు. ఇలా చేయకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు
నిర్వహణ నాణ్యతతో చేయడం కష్టం అవుతుందని, అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలకు
ఇచ్చే ఫీజు రియింబర్స్మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు
వినియోగించేలా ఒక విధానం తీసుకురావాలన్నారు. శస్త్రచికిత్స తర్వాత
విశ్రాంతికాలానికి గాను ఆరోగ్య ఆసరా పథకం కింద రోగికి ఇవ్వాల్సిన డబ్బును
డిశ్చార్జి రోజే అందించాలని, దీనికి కావాల్సిన ఎస్ఓపీని రూపొందించాలని
అధికారులను సీఎం ఆదేశించారు.